Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వైఎస్ షర్మిల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. తనపై మరోసారి విమర్శలు చేస్తే తాను కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు. 'ఏం తమాషాలు చేస్తున్నవా...బుద్దుందా? అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద ఇలాంటి చిల్లర ముచ్చట్లు ఉండేవి కాదన్నారు. 'ఆడపిల్ల్లా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. ఒళ్లు దగ్గర పెట్టుకో. మళ్ళీ నోరు జారితే నీ గురించి చాలా విషయాలు బయట చెప్తా' అని హెచ్చరించారు. ముమ్మాటికీ షర్మిల బీజేపీకి కోవర్టు అని ఆయన ఆరోపించారు.