Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. అది అయన మాటా? కేంద్ర ప్రభుత్వ వైఖరా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. హైదరాబాద్లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఏపీ పునర్విభజన చట్టంలోని తెలంగాణకు ఇచ్చిన హామీలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయం ఉందిగానీ, తెలంగాణకు ఆ అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారంలో 100 నుంచి 150 ఏండ్లకు సరిపడ ఇనుప ఖనిజం నిల్వలున్నాయని గుర్తుచేశారు. అయినా, కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీపై నాన్చుడు ధోరణి అవలంబించడం శోచనీయమని విమర్శించారు. సమావేశంలో ఎంపీ మాలోతు కవిత కూడా పాల్గొన్నారు.