Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాలింపు చేపట్టిన అధికారులు
నవతెలంగాణ - తెలకపల్లి
వాగు నీటి ప్రవాహంలో రైతు కొట్టుకు పోయాడు. అతని కోసం గాలింపు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ వి.ప్రదీప్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..తాళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు మామిళ్ళపల్లి రాఘవేందర్(25) తన పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వస్తుండగా.. తాళ్లపల్లి -కార్వంగ గ్రామాల మధ్య ఉన్న వాగులో కొట్టుకుపోయాడు. సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా ఆచూకీ తెలియలేదు. విషయం తెలుసుకున్న నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదరు కుమార్, జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య వెంటనే గాలింపు కోసం ఏర్పాట్లు చేశారు. కానీ ఆచూకీ లభించలేదు.