Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) 22వ స్నాతకోత్సవం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న బ్రహ్మకుమారీస్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో శనివారం ఉదయం 10.45 గంటలకు జరగనుంది. 2020, 2021, 2022 ఏడాదికి సంబంధించి సుమారు 4,800 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, పతకాలను అందజేస్తారు. ఇందులో 519 మంది ఇంటిగ్రేటెడ్ పీజీ, 3,191 మంది పీజీ, 345 మంది ఎంటెక్, 172 మంది ఎంఫిల్, 573 మంది పీహెచ్డీ విద్యార్థులున్నారు.
ఈ స్నాతకోత్సవంలో దాతల పతకాలు, వర్సిటీ పతకాలు, ఎస్సీ,ఎస్టీ పతకాలు, ఓబీసీ పతకాలు కలిపి 484 మంది అందుకుంటారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యఅతిధిగా హాజరు కావడంతోపాటు స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హెచ్సీయూ చీఫ్ రెక్టార్ విద్యార్థులకు పట్టాలు, పతకాలను అందజేస్తారు.