Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాక్టీస్కు అనుమతిస్తామన్న హామీ ఏమైంది కేసీఆర్ : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీ, పీఎంపీలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్కుమార్ తప్పుబట్టారు. వారికి ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకునేలా అనుమతి ఇస్తామన్న హామీ ఏమైందని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వారు ఇంజక్షన్ వేయకూడదని, సెలైన్ ఎక్కించకూడదని చెప్పడం అన్యాయమని తెలిపారు. రిజిస్ట్రేషన్ లేదనే సాకుతో ప్రజలకు వైద్యం అందించకుండా ఏకంగా ఆర్ఎంపీ వ్యవస్థనే రద్దు చేయాలని చూడటం దుర్మార్గమని పేర్కొన్నారు. గ్రామాల్లో వారు లేకుంటే ప్రజల ప్రాణాలు కాపాడేదెవరు? అని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యుడైన వైద్యశాఖ మంత్రిని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.