Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా విధానాన్ని అమలు చేస్తున్నామని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జాతీయ క్రీడలు జరుగుతున్న అహ్మదాబాద్లో శుక్రవారం కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్తో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం, నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుపోయారు. ఈ భేటీలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఉన్నారు.