Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మ లచ్చిరాం, పి రఘునందన్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కేసీఆర్ విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామంటూ చెప్పినా అధికారుల తాత్సారం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలనీ, 13 జిల్లాల స్పౌజ్లకు బదిలీ చేయాలనీ, ఖాళీగా ఉన్న పోస్టులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేయాలని తెలిపారు. సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల రెండు, మూడు తేదీల్లో ఎమ్మెల్యేలకు విజ్ఞాపన పత్రాలను సమర్పిస్తామని పేర్కొన్నారు.