Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ అభివృద్ధితోనే ప్రపంచ మనుగడ సాధ్యమని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. దాని ప్రస్తావన లేకుండా గతం, వర్తమానం, భవిష్యత్తు ఉండబోదని ఆమె చెప్పారు. కన్హ శాంతి వనంలో మూడు రోజులపాటు నిర్వహించే వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల సమావేశానికి శుక్రవారం ఆమె హాజరై ప్రసంగించారు. ఇటీవల కాలంలో ఇతర కోర్సులతో పోలిస్తే వ్యవసాయ కోర్సులకు విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారన్నారు. ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందనీ, వ్యవసాయ విశ్వవిద్యాల యాలు వాటికున్న లాభాలను రైతులకు తెలియజేయాలని చెప్పారు. వ్యవసాయ విద్యలో మెడిటేషన్, యోగకు చోటిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. మనం తినే ఆహారంతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్ సి అగర్వాల్, కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి. నీరజ ప్రభాకర్ పాల్గొన్నారు.