Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్ఎంపీ, పీఎంపీలను ప్రోత్సహించి తప్పు చేయొద్దని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ డీఏ) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ను కోరింది. ఈ మేరకు ఆర్ఎంపీ, పీఎంపీలపై టీఆర్ఎస్ సర్కారు కక్ష కట్టిందంటూ బండి సంజయ్ ఇచ్చిన పత్రికా ప్రకటనను హెచ్ఆర్డీఏ ట్వీట్ చేసింది. నకిలీ డాక్టర్లు, అర్హత లేని వారు ప్రజారోగ్యానికి ప్రమాదమని హెచ్చరించింది. అలాంటి వారిని ప్రోత్సహించడమంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఎన్ఎంసీ చట్టం-2019ను దుర్వినియోగం చేయడమే కాకుండా అవమానించడమే అవుతుందని సూచించింది.