Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయనతో పాటు నలుగురికి గాయాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద ఆటోను ఢకొీట్టింది. ఆ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన కారులో మహారాష్ట్రకు వెళ్తుండగా ధర్మారం క్రాస్ రోడ్ వద్ద రామగుండం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా రాజీవ్ రహదారి పైకి అడ్డంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఆటోలో ప్రయాణిస్తున్న రామగుండం మండలం మల్యాలపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మీ, అంతర్గాం మండలం రాయబండి గ్రామానికి చెందిన నూనె భూమయ్య, నూనె లక్ష్మి లకు గాయాలయ్యాయి. వారినిపెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్కు తరలించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుడి చేతి వేలుకు గాయమైంది.