Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విదేశీ చదువులు ఆర్థిక భారంతో కూడుకున్నవి. అయితే రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో... జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం నర్సింగాపురానికి చెందిన సపతి భార్గవి వరంగల్ డీసీసీబీ నుంచి రూ.15.50 లక్షల ఆర్థిక రుణం పొందింది. విదేశీ చదువుల కోసం లండన్ బయలు దేరింది. అంతకుముందు రుణం అందే విధంగా సహకరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి తన కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత చదువులు చదివి, తమ తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భార్గవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.