Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తంగిరాల కృష్ణపసాద్ స్మారక రంగస్థల పురస్కారం అత్యంత ప్రతిష్టాత్మకమైనదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రెస్క్లబ్లో ప్రముఖ రంగస్థల నటులు చింతా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో ప్రముఖ రంగస్థల దర్శన నట ప్రయోక్త, స్వాతంత్య్ర సమరయోధులు బబ్బెళ్ళపాటి గోపాలకృష్ణ సాయికి తంగిరాల స్మారక పురస్కారాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నాటక రంగంలో బబ్బెళ్ళపాటి సాయి కృషిని ప్రశంసించారు. తంగిరాల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రేపాల మోహన్రావు, జీడీఎంఎం కాలేజీ చైర్మెన్ జీవీ.ప్రసాదరావు, రమ్యభారతి ఎడిటర్ చలపాక ప్రకాష్, రచయిత, కవి తంగిరాల చక్రవర్తి, ట్రస్ట్ కార్యదర్శి ప్రసన్నకుమారి, తదితరులు పాల్గొన్నారు.