Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే, మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ పండగని ఆనందోత్సాహాల మధ్య తగు జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని సూచించారు.