Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో లౌకికవాదాన్ని కాపాడేందుకే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపిస్తున్నారని క్రిస్టియన్ యూత్ ఫెల్లోషిప్ (సీవైఎఫ్) తెలిపింది. ఆయన ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో సీవైఎఫ్ డైరెక్టర్ వై.మూర్తిరాజు అధ్యక్షతన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రాథమిక హక్కులను, మతస్వేచ్ఛను కాపాడేందుకు వీలుగా జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న కేసీఆర్ను స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐదు వేల మంది పాల్గొన్నారు.