Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయ పోరాటం చేస్తాం : మంత్రి
నవతెలంగాణ- సూర్యాపేట
యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే నిర్మాణం మొదలుపెట్టామని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఏకపక్షంగా ఉందని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్జీటీ తీర్పు యావత్ దేశానికి నష్టం కలిగేలా ఉందన్నారు. ఎన్జీటి తీర్పు పై రివ్యూ పిటిషన్ వేస్తామని, న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టాక.. ఆపాలని తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. నిర్మాణం ఆపాలంటూ లేవనెత్తిన అంశాలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎక్కడో ఉన్న ముంబయి సంస్థకు యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధం ఏంటని ప్రశ్నించారు. దీని వెనకాల కచ్చితంగా కుట్ర దాగి ఉందని చెప్పారు. పర్యావరణ అనుమతులు వచ్చాకే నిర్మాణం చేపట్టామని తెలిపారు. గతంలో ఇదే సంస్థ కేసు వేసినప్పుడు ట్రిబ్యునల్ కొట్టేసిందని గుర్తు చేశారు.