Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ పిడమర్తి రవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వారి అర్హత మేరకు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కారుణ్య నియామకలను ప్రభుత్వం నిలిపివేయడంతో సంబంధిత కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురవుతున్నారని తెలిపారు. సర్కారు వెంటనే స్పందించి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కోరారు. కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న బాధితులు ఈ నెల 10న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశమై తమ హక్కుల సాధన కోసం కార్యాచరణ ప్రారంభిస్తారని తెలిపారు.