Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ మీడియా పబ్లిసిటీ కమిటీ చైర్మెన్ రమణి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఏఐసీసీ మీడియా పబ్లిసిటీ కమిటీ చైర్మెన్ రమణి ఆవేదన వ్యక్తం చేశారు. కులాలు, మతాలు అనే తరతమ్యాలతో మనుషుల మధ్య అనైక్యత పెరిగిపోతుందని చెప్పారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ జాతీయ నేత నదీమ్ జావిద్, రాష్ట్ర నాయకులు ఈరవత్రి అనిల్, చామల కిరణ్కుమార్రెడ్డి, మన్నే సతీష్తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి సమైక్యంగా ఉంచేందుకు భారత్ జోడో పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని విమర్శించారు. దేశ సంపదను తన అనుచర వ్యాపార వేత్తలకు దోచిపెడుతున్నదని ఆరోపించారు. బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తూ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.