Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గేట్లు ఎత్తి దిగువకు విడుదల
నవతెలంగాణ- సిటీబ్యూరో
వరుసగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు పెద్దఎత్తున వరద చేరుతోంది. ఎగువ నుంచి నీరు వస్తుండటంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మాన్సాగర్ సామర్థ్యం 3.900టీఎంసీలు. 450 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో రెండు గేట్లను రెండు అడుగుల మేరకు ఎత్తి 476 క్యుసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక హిమాయత్సాగర్ సామర్థ్యం 2.970 టీఎంసీలు కాగా, 1800 క్యుసెక్కుల వరద ఇన్ఫ్లో ఉంది. దాంతో అధికారులు మూడు గేట్ల ద్వారా 2060 క్యుసెక్కుల నీరును దిగువకు వదులుతున్నారు.