Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్కు ప్రతిష్టాత్మకమైన గురజాడ అప్పారావు పురస్కారం లభించింది. సంఘ సంస్కర్త, సుప్రసిద్ధ సాహితీవేత్త గురజాడ అప్పారావు 160వ జయంతి ఉత్సవాల సంధర్భంగా సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో ఆకృతి స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ అవార్డును ఆయనకు అందజేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, ఆకృతి సుధాకర్, ఎఫ్సీసీఐ సంస్థ సీఎండీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు