Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ మహేందర్ర్రెడ్డి సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజస్థాన్లోని రాంగఢ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐడీ. విభాగం డీజీ గోవింద్ సింగ్ సతీమణి మరణించడం పట్ల డీజీపీ ఎం మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అక్కడి తనోత్ మాత దర్శనానికి తన సతీమణితో కలసి వెళ్లిన గోవింద్ సింగ్ రాంగఢ్కు తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం బోల్తా పడిందని తెలిపారు. ఆయన సతీమణి మరణించగా, గోవింద్సింగ్ గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కోలుకోవాలని డీజీపీ ఆకాంక్షించారు.