Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్రావుకు టీఎన్జీవో వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ నాన్గెజిటెడ్ ఉద్యోగులు (టీఎన్జీవో) కేంద్ర సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇదే అంశంపై టీఎన్జీవో అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ నేతృత్వంలో పలువురు నేతలు మంగళవారం హైదరాబాద్లో ఆర్థిక మంత్రి హరీశ్రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనీ, ప్రధానంగా డీఏలు మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను పటిష్టంగా అమలు చేయాలనీ, పీఆర్సీ పెండింగ్ ఉత్తర్వులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి హరీశ్రావు స్పందిస్తూ త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడటం ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నగర శాఖ కార్యదర్శి శ్రీకాంత్, కేంద్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.