Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరపత్రాన్ని ఆవిష్కరించిన పద్మారావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభలు ఈనెల 29, 30 తేదీలలో హైదరాబాద్లో జరగనున్న నేపథ్యంలో సంబంధిత కరపత్రాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావుగౌడ్ ఆవిష్కరించారు. గురువారం సికింద్రాబాద్ ఆయన నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ స్పీకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కషి చేస్తున్న ఈ సంఘం రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పి. ఆనందం, హెచ్యూజే అధ్యక్షులు ఈ. చంద్రశేఖర్, నాయకులు బి. రాజశేఖర్, గుడిగ రఘు తదితరులు పాల్గొన్నారు.