Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రికి ఎంపీ రవిచంద్ర వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పెట్రోలియం డీలర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈమేరకు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరికి ఆయన వినతిపత్రం సమర్పించారు. ప్రకతి వైపరీత్యాలు సంభవించే సందర్బాల్లో పెట్రోలియం డీలర్లు ప్రజలకు నిత్యావసర సరుకులు సకాలంలో అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. పలు ప్రభుత్వ పథకాల అమలు కోసం తమ వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై మార్జిన్ చెల్లింపుల్లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఆయన వివరించారు. ఒక్క రూపాయి మార్జిన్ చెల్లిస్తే 43 పైసలు ఆయిల్ మార్కెటింగ్ కార్పొరేషన్కు చెందుతున్నదని తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకుని డీలర్లకు వెంటనే తగు న్యాయం చేసేలా చూడాల్సిందిగా కోరారు.