Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ (ఎంఎంటీఎస్) రైళ్లు సమయపాలనతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని దక్షణ మధ్య రైల్వే ప్రకటించింది. జంట నగరాల్లో సబర్బన్ రైలు రవాణా సేవలు బాగా అందుతున్నాయని పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇంచార్జి) అరుణ్ కుమార్ జైన్ ఈమేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సురక్షితమైన రవాణా కోసం నగరంలో అత్యంత అనుకూలమైన, ఉత్తమ ప్రయాణం కోసం ఎంఎంటీఎస్ రైళ్లను ఎంచుకోవాలని కోరారు. టిక్కెట్ల కొనుగోలు కోసం ఇబ్బంది లేకుండా అనేక రకాల సులువైన టికెటింగ్ సదుపాయం కూడా కల్పించామనీ, ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.