Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హిందీ మాద్యమాన్ని తప్పనిసరి చేసే పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కుల నిర్మూలన వేదిక రాష్ట్ర అద్యక్ష, కార్యదర్శులు కోట ఆనంద్, పాపని నాగరాజు గురువారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికి ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయటమేనని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైందని పేర్కొన్నారు. పార్లమెంటు అధికార భాషా కమిటీ చేసిన కామన్ లాంగ్వేజ్ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.