Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూర్
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శివన్నగూడ రిజర్వాయర్ భూనిర్వాసితులు నల్లగొండ జిల్లా చండూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో శుక్రవారం ఆందోళనకు దిగారు. మర్రిగూడ మండలంలోని కుదబక్షపల్లి, నర్సిరెడ్డిగూడె, వెంకేపల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన శివన్నగూడ భూనిర్వాసితులు చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం గేట్లను నెట్టుకుంటూ ఒక్కసారిగా లోపలికెళ్లారు. దాంతో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.