Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో శుక్రవారం 22 క్రస్ట్గేట్లను ఎత్తి 80,172 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 16 గేట్లను 10 అడుగుల మేర, 6గేట్లను 15 అడుగుల మేర ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్కు 3,62,605 క్కూసెక్కుల నీరు వస్తోంది. అవుట్ఫ్లో 4,04,105 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.50 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతానికి 310.5510 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 33,211 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 5438 క్యూసెక్కులు, కుడికాల్వకు 8144 ఎస్ఎల్బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, లోలేవల్ కెనాల్ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.