Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3,554 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించిన ఆగస్టు, సెప్టెంబర్ వేతనాలు రూ.38.53 కోట్లు విడుదల చేశారు. జీతాలు విడుదల చేయడం పట్ల టీఎస్జీసీసీఎల్ఏ-475 అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు టి హరీశ్రావు, పి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.