Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29న పాఠశాలల్లో నిరసన ప్రదర్శనలు : సొసైటీ కార్యదర్శికి టీఎస్యూటీఎఫ్ నోటీసు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాలయాల సంస్థల్లో బోధనా సమయం ఇతర సంక్షేమ గురుకులాల్లో మాదిరిగా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మార్చాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టును శుక్రవారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి కలిసి నోటీసు అందజేశారు. రెండు దశల పోరాట కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈనెల 29న పాఠశాలల్లో నిరసన ప్రదర్శనలుంటాయని పేర్కొన్నారు. వచ్చేనెల 13న హైదరాబాద్లోని ధర్నాచౌక్లో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.