Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 నుంచి ఆన్లైన్లో ధ్రుపత్రాల పరిశీలన
- 28 నుంచి వెబ్ఆప్షన్ల నమోదు
- నవంబర్ 4న తొలివిడత సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. శనివారం హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఎడ్సెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఎడ్సెట్ ప్రవేశాల కన్వీనర్ పి రమేష్బాబు హాజరయ్యారు. అనంతరం షెడ్యూల్ను విడుదల చేశారు.
ఈనెల 18 నుంచి 26 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్తోపాటు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 26 నుంచి 28 వరకు ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల(ఎన్సీసీ, సీఏపీ, వికలాంగులు, స్పోర్ట్స్)కు ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని పేర్కొన్నారు. ఈనెల 28 నుంచి 30 వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముందని వివరించారు. వచ్చేనెల నాలుగున తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. అదేనెల ఐదు నుంచి 11 వరకు కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన తోపాటు ట్యూషన్ ఫీజు చెల్లింపు ఉంటుందని పేర్కొన్నారు. 14 నుంచి బీఎడ్ తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. ఇతర వివరాలకు ఈనెల 18 నుంచి http://edcetadm.tsche.ac.in వెబ్ సైట్ను సంప్ర దించాలని సూచించారు. ఈ ఏడాది ఎడ్సెట్కు 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 31,578 మంది రాతపరీక్షకు హాజరయ్యారు. 30,580 (96.84 శాతం) మంది అభ్యర్థులు ఉతీర్ణత సాధించారు.