Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపస్మారక స్థితిలో ఇద్దరు రైతులు
నవతెలంగాణ-దిలావర్పూర్
పొలం పనుల్లో ఉన్న రైతుల సమీపంలో పిడుగు పడటంతో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని కంజర్ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బండి శీల నడిపి సాయన్న, యాసిన్ వ్యవసాయ పనుల్లో ఉండగా వర్షం పడింది. ఇదే క్రమంలో పిడుగు పడటంతో వారిద్దరూ అపస్మారక స్థితిలో పడిపోయారు. స్థానికులు గమనించి 108 అంబులెన్స్కు సమాచారం అందజేశారు. వారిని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సర్పంచ్ మధుకర్ తెలిపారు.