Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ) ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాసం ప్రభాకర్ పోటీ చేయనున్నారు. హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. జీటీఏ ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాసం ప్రభాకర్ను ఏకగ్రీవంగా ఆమోదించామని తెలిపారు. పాత పద్ధతిలోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలని కోరుతూ తీర్మానం చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు దశరథ్, అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.