Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరగడంతో 2,30లక్షల క్యూసెక్కుల నీరు జూరాలకు చేరింది. దాంతో 43 గేట్లు ఎత్తి 2,30,191 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు పీజేపీ అధికారులు తెలిపారు. జలాశయ నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.507 టీఎంసీల నీరుంది. 28,478 క్యూసెక్కుల నీటిని ఉపయోగించి యూనిట్లలో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి యథావిధిగా నెట్టెంపాడుకు 0 క్యూసెక్కులు, భీమా లిఫ్టు-1కి 0 క్యూసెక్కులు, భీమాలిఫ్టు-2కు 750 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 820 క్యూసెక్కులు, కుడికాల్వకు 548 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 105 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 0 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.