Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 36 మంది నామినేషన్ల ఉపసంహరణ
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. మొత్తంగా 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు సోమవారం తెలిపారు. అక్టోబర్ 7వ తేదీన ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాగా, 14వ తేదీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తంగా 130 మంది అభ్యర్థులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూట్నీలో 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 83 మంది అభ్యర్థుల్లో 36 మంది సోమవారం వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరిగా, మునుగోడు బరిలో 47 మంది అభ్యర్డులు పోటీలో ఉన్నారు.