Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బంగాళాఖాతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనీ, ఆ తదుపరి 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి, సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు. ఆ ఆవర్తనం ప్రభావం వలన ఆగేయ బంగాళా ఖాతం, దాని పరిసరాలలోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంమీదుగా తూర్పు, ఆగేయ దిశ నుంచి కిందిస్థాయిలో చల్లని గాలులు వీస్తున్నాయని తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోమవారం రాష్ట్రంలో 42 ప్రాంతాల్లో వర్షపాతం నమోదుకాగా, మహబూబాబాద్ జిల్లా గూడూరులో అత్యధికంగా 3.7 సెంటీమీటర్ల వాన పడింది.