Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడిటర్ సుధాభాస్కర్ పరామర్శ
నవ తెలంగాణ-కొండపాక
నవ తెలంగాణ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ నరేందర్రెడ్డి తండ్రి పోతుగంటి యాదవరెడ్డి(68) సోమవారం రాత్రి వారి స్వగ్రామం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం గిరాయిపల్లిలో గుండెపోటుతో మృతి చెందారు. నవతెలంగాణ ఎడిటర్ సుధాభాస్కర్, ఎస్వీకే బాధ్యులు బుచ్చిరెడ్డి, హైదరాబాద్ రీజియన్ జీఎం లింగారెడ్డి మంగళవారం యాదవరెడ్డి భౌతికకాయంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్ సంతాపం ప్రకటించారు. అంత్యక్రియల్లో నవతెలంగాణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.