Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గాజులరామారం పరిధిలోని షాపూర్ నగర్లో నివసిస్తున్న సత్యనారాయణ అనే బాధితుడు ప్రమాదవశాత్తూ రెండు చేతులూ కోల్పోయిన క్రమంలో అతడికి డబుల్ బెడ్ రూం ఇంటిని కేటాయించాలని మేడ్చెల్ జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. అతడి దీనగాథను వివరిస్తూ మీడియాలో కథనాలొచ్చిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఇంటి కేటాయింపునకు సంబంధించిన ఆర్డర్ కాపీని మంగళవారం ఆయనకు అందజేశారు. సదరం సర్టిఫికెట్ను అందజేయటం ద్వారా త్వరలోనే వికలాంగుల పింఛన్ను కూడా ఇప్పిస్తామంటూ హామీనిచ్చారు.