Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా యాసంగి పంటలకు మద్దతు ధర నిర్ణయించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. మద్దతు ధరలు పెంచే విషయంలో మోడీ సర్కారు మరో సారి రైతుల్ని మోసం చేసిందని విమర్శించింది. 2022-23 యా సంగి మార్కెటింగ్ సీజన్లో రబీ ధరల పెంపుదల గోధుమలో 5.5 శాతం కాగా, మంచి శనగలో 2 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. ఈమేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం పెంచిన ధరలు ఉత్పత్తి ఖర్చులను, ధరల పెరుగుదలను తట్టుకునేలా లేదని విమర్శించారు. గతేడాది కాలంలో ఇంధనం, ఎరువుల ధరలు పెరిగాయని గుర్తు చేశారు. రైతుల కు అవసరమైన సమయంలో ఎరు వులు సరిగ్గా అందడంలేదనీ, అనేక ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనాల్సి వచ్చిందని తెలిపా రు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసా యోత్పత్తుల ఖర్చుల కమిషన్ (సీఎస్సీపీ) రబీ మద్దతు ధరలను ప్రతిపా దించినప్పుడు పరిగణనలోకి తీసుకో లేదని విమర్శి ంచారు. ఈ కమిషన్ లెక్కల ప్రకా రం రబీ పంటల ఉత్పత్తి ఖర్చు కేవలం 3.8 శాతం పెరిగిందని సూచించిందని పేర్కొన్నారు. పెరుగుతున్న వ్యవసా య ఉపకరణాల ఖర్చులను తక్కువ గా చూపించారని పేర్కొన్నారు. ఇదే గాక అన్ని వస్తువుల ధరల పెరుగు దలను తక్కువగా అంచనా వేసిందని విమర్శిం చారు. పండిన పంటలను ప్రభుత్వం సేకరించకపోవడంతో మద్దతు ధరలకు అర్థమే లేకుండా పోయిందనీ, ఫలితంగా రైతులు తమ ఉత్పత్తులను ప్రయివేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం సమగ్ర ఉత్పత్తి ఖర్చు సీి2తో మద్దతు ధర నిర్ణయించాలనీ, అది కూడా ఖరీఫ్, రబీ పంటలకు ప్రతి ఆరు నెలలకోసారి ఆ ధరలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిర్ణయించిన మద్దతు ధరలకు పంటలను కొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు.