Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. గురువారం హైదరాబాద్లోని యూనియన్ కార్యాలయంలో ఆయన్ను కలిసి పలు సంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. అందులో ప్రభుత్వ డిగ్రీ కాలేజెస్ క్వాలిఫైడ్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ (జీడీసీక్యూసీఎల్ఏ), తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీసీసీఎల్ఏ), తెలంగాణ పాలిటెక్నిక్స్ లెక్చరర్స్ అసోసి యేషన్-కాంట్రాక్టు (టీజీపీఎల్ఏ-ఏ), ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ గిల్ట్, టీకేజీబీవీసీటీఏ, పీఎంటీఏ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. పీఆర్టీయూ టీఎస్ సంఘం ప్రాతి నిధ్యం వహిస్తున్న టీటీజేఏసీలోని 20 ఉపాధ్యాయ సంఘాల తోపాటు మరికొన్ని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు త్వరలోనే తమ మద్దతును తెలపనున్నట్టు యూని యన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.