Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా గ్రామ ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నారంటే టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చుననీ, దేశ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ దిగజారి వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మానవత్వం, నైతిక విలువలు లేకుండా జేపీ నడ్డాకు సమాధి కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధి కట్టే హక్కు టీఆర్ఎస్ నేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తమ సహనాన్ని అసమర్థతగా భావిస్తే.. కేసీఆర్ కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.