Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లింగంవారిగూడెంలో రఘునందన్రావుకు చుక్కెదురు
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారానికి వస్తున్న బీజేపీ నేతలకు రోజుకో ఊర్లో నిరసన వ్యక్తమవుతోంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్రావుకూ అది తప్పడం లేదు. నిలదీతలు, అడ్డగింపులు ఎదురవుతున్నాయి. సంస్థాన్నారాయణపురం మండలంలోని కోతులా పురంలో మొన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నేడు లింగంవారిగూడెంలో ఆయన ప్రచారాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీజేపీ గో బ్యాక్, మోడీ డౌన్ డౌన్ అంటూ శుక్రవారం లింగవారిగూడెం గ్రామస్తులు, టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావును అడ్డుకున్నారు. మా ఊరిలో ప్రచారం చేయొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ నాయకులు ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు.