Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడుపై మిదతల దండులా దాడిచేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోటాకు ఓటు వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను బహిర్గతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి సంధ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి జి అనురాధ తదితరులు పాల్గొన్నారు.