Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చిన్నారిపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి స్కూల్ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లోని రేవంత్ నివాసంలో బాధిత చిన్నారి తల్లిదండ్రులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సదరు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. చిన్నారిపై పైశాచిక చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడేంత వరకు ఒత్తిడి పెంచుతామని చెప్పారు.