Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షబ్బీర్ అలీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఎన్నికల్లో మతపరమైన ప్రచారం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఛీఫ్ ఎన్నికల కమిషన్తో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినట్టు మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే నాలుగు శాతం మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని మాట్లాడా రంటూ విమర్శించారు. తద్వారా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందు కు ప్రయత్నించారని తెలిపారు. వెనుకబడిన ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయనీ, ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై సీనియర్ల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని షబ్బీర్ అలీ తెలిపారు.