Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ ఉద్యోగులకు 45 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు వేతన సవరణ కమిటీ చైర్మెన్ శ్రీనివాసరావుకు ప్రతిపాదనలు సమర్పించారు. ఆర్టిజన్లకు 50 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలనీ, 2004 వరకు నియమించబడిన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. వాటితో పాటు పలు డిమాండ్లతో కూడిన ప్రతిపాదనలను కమిటీకి అందచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, మారం శ్రీనివాస్, ఎమ్ విజయకుమార్, ఎమ్ అశోక్కుమార్, పీయాదగిరి, బ్రహ్మేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.