Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీకి రూ.100 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ కృతజ్ఞతలు తెలిపినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రగతిభవన్లో సీఎంతో పాటు పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కూడా మర్యాదపూర్వకంగా కలిసి, ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ పురోగతి సాధిస్తున్నదనీ, ఉద్యోగులకు పండగ అడ్వాన్సులు, బకాయిలు చెల్లిస్తున్నదని తెలిపారు. త్వరలోనే పెండింగ్లో ఉన్న పీఆర్సీ, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లిసామన్నారు. అలాగే మంత్రులు తన్నీరు హరీశ్రావు, పువ్వాడ అజరుకుమార్ను కూడా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.