Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో 38 గేట్లు ఎత్తారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 2 లక్షల 5 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతోంది. జలాశయ నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.555 టీఎంసీల నీరుంది. 22,695ల క్యూసెక్కుల నీటిని ఉపయోగించి యూనిట్లలో 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తంమీద జూరాల నుంచి దిగువకు లక్షల 92 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.