Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే అంశంపై ఐదురోజులపాటు సబ్జెక్టుల వారీగా నిపుణులతో ఉచిత అవగాహన తరగతులను నిర్వహిస్తామని 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెన్ పి క్రిష్ణప్రదీప్ తెలిపారు. ఈనెల 26 నుంచి 30 వరకు పాలిటీ, పరిపాలన, జనరల్ స్టడీస్, చరిత్ర, ఎకానమి, ఆన్సర్ రైటింగ్ వంటి అంశాలపై సీనియర్ అధ్యాపకులు సమగ్ర అవగాహన కల్పిస్తారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.