Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెబ్ఆప్షన్ల గడువు నేటితో పూర్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ఆప్షన్ల నమోదుకు ఆదివారం వరకే గడువున్నది. శనివారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. ఈనెల 26న తుది విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 26 నుంచి 28 వరకు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లింపుతోపాటు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 27న స్పాట్ ప్రవేశాల మార్గదర్శకాలను విడుదల చేస్తారు. ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి రెండు విడతల్లో సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో 177 ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 78,336 సీట్లున్నాయి. మొదటి, రెండు విడతల్లో కలిపి 64,134 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఇంకా 14,202 సీట్లు మిగిలాయి.