Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అగ్రవర్ణాల నాయకత్వంలో నడిచే రాజకీయ పార్టీలు ఎప్పటికైనా బీసీలకు అద్దె కొంపల్లాంటివేనని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం లో బీసీలకు సముచిత ప్రాధాన్యత దక్కడం లేదని విమర్శించారు. అందుకే విస్తృతంగా బీసీ నాయకుల వలసలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వారు రాజకీయ బానిసలు కాదనీ, వారి ఆత్మాభిమానాన్ని అవకాశాలతో, డబ్బుతో కొనాలనుకునే ఆలోచనలను ఇకకైనా మానుకోవాలని ప్రధాన పార్టీలకు ఆయన సూచించారు.